Monday, May 6, 2024

FLASH: బైక్ షోరూం వద్ద ఘర్షణ.. ఇద్దరు యువకులపై ఎస్సై దాడి ?

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ద్విచక్ర వాహనాల షోరూం వద్ద జరిగిన ఘర్షణ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గణపురం మండల కేంద్రంలోని ఓ షో రూమ్ లో ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్ఓసి కోసం మండల కేంద్రానికి చెందిన పెండ్యాల ప్రశాంత్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి యజమానిని అడిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ప్రశాంత్ మరికొందరు యువకులతో కలిసి  మరోసారి షోరూం వద్దకు వెళ్లి ఘర్షణకు దిగారు. దీంతో షోరూమ్ యజమాని పోలీసులకు ఫోన్ చేయడంతో షోరూమ్ వద్ద ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రశాంత్ తో పాటు మరో యువకుడు శ్రావణ్ పై దాడి చేయడంతో మనస్థాపంతో మంగళవారం రాత్రి ప్రశాంత్ పురుగుల మందు చేయించగా మొదట అతని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తన ఆత్మహత్య యత్నానికి స్థానిక ఎస్ఐ తో పాటు మరో ముగ్గురు అని  సూసైడ్ లెటర్ లో రాసుకునట్లు సమాచారం. మంగళవారం రాత్రి సంఘటన జరిగినప్పటికీ పోలీసు అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఉన్నతాధికారులను వివరణ కోరగా వస్తామేనని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement