Friday, May 17, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్‌.. క్షతగాత్రులు సొంత వాహనంలో తరలింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మంత్రి కేటీఆర్‌ మానవత్వం చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌ తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చూసి వెంటనే కారు దిగి పరామర్శించారు. తన వాహనంలోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం చేగుంట వద్ద జరిగింది. క్షతగాత్రులను వెంటనే తన వెహికిల్‌లో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. వైద్యులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement