Wednesday, May 1, 2024

చెట్టు పైనుండి పడి వ్యక్తి మృతి.. వరంగల్​ జిల్లాలో ఘటన

ఖానాపురం (ప్రభన్యూస్): చింతకాయలు దులుపుతూ ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి ఒక‌రు చ‌నిపోయిన ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలో ఇవ్వాల (శ‌నివారం) జ‌రిగింది. మృతుడిని రాధారపు విజేందర్(40)గా గ్రామ‌స్తులు తెలిపారు. ఖానాపురం మండలం, కొత్తూరు గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

కుటుంబ సభ్యులు, గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. విజేందర్ త‌మ వ్యవసాయ భూమిలో ఉన్న చింత చెట్టు ఎక్కి, కాయలు దులుపుతుండగా కాలు జారి కింద ప‌డిపోయాడు. ఇది గ‌మ‌నించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నర్సంపేట హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. ప‌రిశీలించిన డాక్ట‌ర్లు అప్పటికే విజేందర్ చ‌నిపోయిన‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement