Friday, May 3, 2024

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐజేయు కృషి


జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ఎప్పుడు ముందు ఉంటుందని ఐ జేయు జాతీయ నాయకులు ఆంద్రప్రదేశ్ ప్రభత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అన్నారు. బుధవారం శివనగర్ లోని సాయి కన్వెన్షన్ హాల్లో వరంగల్ జిల్లా tuwj, iju వరంగల్ జిల్లా కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జాతీయ రాష్ట్ర నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడు తోట సంపత్ రావు తో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు దాసరి కృష్ణరెడ్డి, గడిపెళ్లి మధుగౌడ్, కరుణాకర్, యూసఫ్, బాబు, రాజీ రెడ్డి వెంకటరమణ, విద్యా సాగర్ యదగిరి, శ్రీధర్ రెడ్డి, బుచ్చి రెడ్డి , సంతోష్, రంగనాథ్ సాంగోజి రవి, రాజేష్, రమేష్ తోపాటు జిల్లా నూతన అధ్యక్షుడు శ్రీ రాం రాంచందర్ కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్ కోశాధికారి వడిచెర్ల శ్రీనివాస్, గోపి, జన్ను స్వామి, బోళ్ల అశోక్, సత్యనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఆడెపు సాగర్, కార్యదర్శి కిరణ్ తిరుపతి రెడ్డి, తో పాటు జిల్లా లోని అన్ని మండలాలకు చెందిన పాత్రికేయులు ప్రింట్ ఎలక్ట్రానిక్ డెస్క్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement