Tuesday, May 7, 2024

వరంగల్ లో భారీ వర్షం.. మార్కెట్ లో త‌డిసిన ప‌త్తి..

వ‌రంగల్ లో భారీ వ‌ర్షం కురిసింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ లో పత్తి తడిసి ముద్ద‌య్యింది. కొనుగోళ్ళకు ఖరీదుదారులు విముఖత చూపుతున్నారు. పత్తి ధర తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కాటన్ కొనుగోళ్లు ప్రారంభించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తడిసిన పత్తిని ఖరీదు చేయలేమని వ్యాపారులు తేల్చి చెబుతున్నారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులుఏ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో రైతులు నిర‌స‌న‌కు దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement