Wednesday, May 15, 2024

స్వామివారికి వెండి ఆభరణాలు సమర్పించిన గండ్ర జ్యోతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనిలోని శ్రీ సీతారామాంజ నేయ స్వామి ఆలయంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం రాత్రి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి వెండి ఆభరణాలు (తొడుగులు,కవచాలు,కిరీటాలు, పాదుకలు) కానుకలను సమర్పించి, మొక్కులను తీర్చుకున్నారు. మొదటగా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకోగా వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి ఆభరణాలను శ్రీ సీతారామ చంద్ర స్వామి వారికి అలకరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ సెగ్గెం వెంకట రాణిసిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు,  టౌన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, కౌన్సిలర్లు ముంజపల్లి మురళి, స్వరూప రాణి, దేవేందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, ఆలయ కమిటీ ఛైర్మెన్ సారయ్య, టిబిజికెఎస్ వైస్ ప్రేసిడెంట్ కొక్కుల తిరుపతి, కో ఆప్షన్ మెంబర్ వజ్రమని, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement