Tuesday, April 30, 2024

అభివృద్ధే ధ్యేయంగా ముందుకు : ఎమ్మెల్యే చల్లా ధ‌ర్మారెడ్డి

వరంగల్ : రాష్ట్ర, అభివృద్ధి సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయమ‌ని ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో రూ.54.52 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.12.60లక్షలతో వైకుంఠదామం, రూ.35.00 లక్షలతో నూతనంగా వేసిన సిసి రోడ్లు, రూ.7.00 లక్షలతో మహిళ ప్రగతి భవనం, పల్లె ప్రకృతి వనాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement