Thursday, April 25, 2024

కుటుంబ కలహాలు.. పంచాయితీకి పిలిచి భార్య, కొడుకుపై కత్తితో దాడి

నర్సంపేట, (ప్రభ న్యూస్): కుటుంబ కలహాలతో భార్య, కొడుకుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన న‌ర్సంపేట మండ‌లం చంద్రయ్యపల్లిలోలో ఇవ్వాల (సోమవారం) జ‌రిగింది. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన నిధిగొండ కోటిలింగం భార్య విజయ, కుమారుడు ప్రవీణ్‌తో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కోటి లింగం నిత్యం కుమారుడు, భార్యతో గొడవకు ప‌డేవాడు. కొంత‌కాలంగా వారికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందాం అని ఆదివారం ఉదయం గ్రామానికి వ‌చ్చారు.

సోమవారం ఉదయం పంచాయతీ జరుగుతున్న సమయంలో మాట మాట పెరిగి కోపోద్రిక్తుడైన కోటి లింగం తన భార్యతోపాటు కుమారునిపై కత్తితో దాడి చేశాడు. అప్రమత్తమైన స్థానికులు నర్సంపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులు గాయాల నుండి కోలుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement