Monday, April 29, 2024

Breaking: డీసీఎం బోల్తా : ప‌ది మందికి తీవ్ర‌గాయాలు

డీసీఎం వాహ‌నం బోల్తా ప‌డి ప‌ది మందికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ జిల్లాలోని రేగొండ మండలం జంషెడ్ పేట్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో పది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాత్రులను చికిత్స నిమిత్తం ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement