Wednesday, May 15, 2024

FLASH: తిరుమలలో తొక్కిసలాట.. పలువురు భక్తులకు గాయాలు

తిరుమల శ్రీవారిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు ఎగబడ్డారు. ఇవాళ ఉదయం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే రెండు రోజులుగా టోకెన్ల జారీని టిటిడి పాలక మండలి అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో నిలిచిపోయారు. అయితే, తిరుపతి భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల పంపిణీని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ముందే చాలా మంది భక్తులు ఆయా కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో గోవిందరాజస్వామి సత్రం వద్ద భక్తుల తాకిడి మరింత ఎక్కువ కావడంతో టికెట్ల కోసం పోటీ ఏర్పడింది. దీంతో తోపులాట జరిగింది. కొద్దిమంది పోలీసులున్నా, టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నా కట్టడి చేయలేకపోయారు. ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

అయితే, టీటీడీ అధికారులు, సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. లైన్ లో నిలబడిన వారికి సర్వదర్శనం టోకెన్లను కేటాయించకుండా బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించలేదని మండిపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కౌంటర్ల వద్ద జనం ఎగబడుతుండడంతో ఇవాళ్టికి ఎవరికీ టోకెన్లు అవసరం లేదని, టోకెన్లు లేకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చునని స్పష్టం చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement