Wednesday, May 1, 2024

WGL:కాంగ్రెస్ లోకి జోరుగా కొనసాగుతున్న వలసలు

భూపాలపల్లి, (ప్రభన్యూస్): భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం భూపాలపల్లి వైస్ ఎంపిపి సముద్రాల దీపారాని శ్రీనివాస్ దంపతులు, కమలపూర్ గ్రామ బీజేపీ మాజీ ఎంపీటీసీ రేగళ్ల భాగ్యలక్ష్మి – సదానందం దంపతులు, కమలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ గుండు సమ్మయ్య, ది కాకతీయ లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్ చంద్ నాయక్ లతో పాటు కమలాపురం గ్రామం నుండి సుమారు మరో 150మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డితో కలిసి భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమంలో వారి వెంట కమలాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి వెంకటస్వామి, గ్రామ మాజీ సర్పంచ్ తోట సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామినేని రవీందర్ లతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement