Tuesday, April 30, 2024

మాజీ ఎంపీని పరామర్శించిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ మాజీ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావును ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌ల అనారోగ్యానికి గురైన ల‌క్ష్మీకాంత‌రావు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయ‌న ఆరోగ్య వివ‌రాల‌ను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ, క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని కేసీఆర్ ప్రారంభించారు. అనంత‌రం వ‌రంగ‌ల్‌లో నిర్మిస్తున్న సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఆ త‌ర్వాత కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు నివాసానికి వెళ్లి ఆయ‌న‌ను కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. కేసీఆర్ వెంట మంత్రులు హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే స‌తీశ్ బాబు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో పాటు త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement