Monday, April 29, 2024

TS : రైల్వే స్టేషన్‌లో తనిఖీలు… 14 కిలో గంజాయి స్వాధీనం…

వికారాబాద్, ఏప్రిల్ 1 (ప్రభ న్యూస్): పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వివిధ రైల్వేస్టేషన్‌లో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా సోమ‌వారం వికారాబాద్ రైల్వే పోలీసులు రైల్వే స్టేష‌న్‌ల‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో 14 కిలోల గంజాయిని త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

వారి వ‌ద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులిద్ద‌రిని రిమాండ్‌కు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వివరించిన కఠిన చర్యలు తప్పవని రైల్వేపోలీసులు స్పష్టం చేశారు, ప్రధానంగా రైల్వేలో గంజే సరఫరా జరుగుతుందన్న సమాచారంతో వివిధ రైల్వే స్టేషన్‌ల‌లో, రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement