Thursday, May 2, 2024

మరిపెడలో కార్టెన్ సెర్చ్

మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ లారిధిలోని బోడఅమృ తండాలో ఆదివారం తెల్లవారుజామున తొర్రుర్ డీఎస్పీ ఏ.రఘు ఆధ్వర్యంలో ఇద్దరు సీఐ లు, 11మంది ఎస్ఐలు మొత్తము 82మంది పోలీసు సిబ్బంది కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో 40 క్వింటాళ్ల‌ నల్లబెల్లం, 3.5 క్వింటాళ్ల పట్టిక, 2 ఇసుక ట్రాక్టర్లు, నల్లబెల్లం తరలిస్తున్న ఓ ట్రాలీ, ఓ ఆటో, నెంబర్ ప్లేట్, సరైన ధ్రువపత్రాలు లేని 52 వాహనాలు, రూ.45వేల విలువ చేసే మద్యం, రూ.3500 విలువ గల గుట్కా, అంబర్ ప్యాకెట్లు సీజ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సెర్చిలో మరిపెడ సిఐ ఎన్ సాగర్, తొర్రుర్ సీఐ, ఎస్ ఐలు దూలం పవన్, నరేష్, మంగిలాల్, రియాజ్, సంతోష్, ఝాన్సీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement