Friday, April 26, 2024

బస్సు, లారి ఢీ.. ఒకరు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మంగపేట మండలం రాజుపేట కొత్త పెట్రోల్ బంక్ సమీపంలో ఈ తెల్లవారుజామున లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళా ప్రయాణికురాలు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని చీపురుదుబ్బ గ్రామం మూల మలుపు వద్ద విశాఖపట్నం నుంచి వస్తున్న బస్సు.. ఇసుక లారీ ఢీకొన్నాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement