Thursday, April 25, 2024

నేడు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో కేసీఆర్ ప‌ర్య‌ట‌న

తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. అందులో భాగంగా ముందుగా ఈరోజు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన‌నున్నారు. ఈ ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని, 10.15 గంటలకు హెలికాప్టర్ లో మహబూబాబాద్ కు బయల్దేరారు. 11 గంటలకు మహబూబాబాద్ కు చేరుకుంటారు. 11.10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

11.40 నుంచి 1.30 గంటల వరకు నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి, అక్కడి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్తగూడెంకు చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 1.55 గంటలకు నూతన కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. 2.55 గంటల నుంచి 3.20 వరకు బహిరంగసభలో పాల్గొంటారు. 4.30 గంటలకు హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు. అనంత‌రం సాయంత్రం 5.40 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు చేరుకుంటారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement