Thursday, May 9, 2024

TS | మోసం చేశాడ‌ని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధ‌ర్నా

మంగపేట, అక్టోబర్ 5 ( ప్రభ న్యూస్) : తనను ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామంలో జరిగింది. ఇందుకు సంబందించి సదరు యువతి తెలిపిన ప్రకారం వివరాలా ఉన్నాయి…. కోమటిపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి (22), అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కారుపోతుల నర్సయ్య కుమారుడు కారుపోతుల రవి వర్మ గత ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి ఇంటర్ చదువుతున్న సమయంలో త‌న‌ని ప్రేమిస్తున్నానని వెంటపడగా.. సదరు యువతి ఒప్పుకోకపోవడంతో నువ్వు లేకపోతే నేనుండలేనని, తాను చచ్చిపోతానని రవివర్మ సంవత్సరం పాటు సదరు యువతి వెంట‌బడడంతో సదరు యువతి ఒప్పుకుంది.

అప్పటి నుండి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుండగా యువతిని శారీరకంగా లొంగదీసుకునే ప్రయత్నం చేయగా.. యువతి ఒప్పకోకపోవడంతో మూడేళ్ల క్రితం వరంగల్ లోని ఓ రామాలయంలో ఎవ‌రికీ తెలియ‌కుండా సదరు యువతిని రవి వర్మ పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి యువతితో శారీరక సంబంధం కొనసాగించాడు. తనను బహిరంగంగా పెళ్లి చేసుకోవాలని సదరు యువతి రవి వర్మను కోరగా గత కొంతకాలంగా దాటవేసే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా రవి వర్మ మరో యువతని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో విషయం తెలిసిన సదరు యువతి తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ‌ సాయంత్రం ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement