Saturday, May 4, 2024

Warangal : పాదచారిని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం…

వరంగల్ : వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద పాదచారిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. రక్త స్రావంతో పడి ఉన్న క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చినపెల్లి చంద్రయ్యగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement