Friday, May 3, 2024

Tadipatri : నిద్రిస్తున్న దంపతులపై హత్యాయత్నం

తాడిపత్రి టౌన్ (ప్రభన్యూస్) : అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని చుక్కలూరు క్రాస్ వద్ద నల్లబండల ఫ్యాక్టరీలో ఆరుబయట నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతి దంపతులపై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల మేరకు పలువురు ఆరుబయట మంచాలు వేసుకొని నిద్రిస్తుండగా అర్ధరాత్రి కేకలు వినబడడంతో లేచి చూడగా నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు మంటల్లో విలువలాడుతూ కనిపించారని వెంటనే మంటలు ఆర్పి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. నల్లపురెడ్డి, సరస్వతి దంపతులకు తీవ్ర గాయాలు కాగా… సమీపంలో నిద్రిస్తున్న పూజిత అనే అమ్మాయికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే గత రెండు రోజుల క్రితం అదే ఫ్యాక్టరీలో కూలి ప‌ని చేస్తున్న సరస్వతి చెల్లెలు భర్త నల్లపురెడ్డి తో గొడవ పడినట్లు స్థానికులు తెలిపారు. అతను రాత్రి నుండి కనిపించలేదని అతనే ఈ దారుణానికి వడగట్టి ఉంటాడని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement