Friday, April 26, 2024

లాయర్ పై టీఆర్ఎస్ కార్పొరేటర్ దాడి

కొద్ది నెలల క్రితం కరీంనగర్ జిల్లాలో పట్టపగలే హైకోర్ట్ లాయర్ దంపతులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతనే సుత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన జరిగింది. వరంగల్ లో ఓ టీఆర్ఎస్ కార్పొరేటర్ రెచ్చిపోయారు. భూవివాదంలో నోటీసులు పంపిన అడ్వకేట్‌పై కార్పొరేటర్‌ అనుచరులతో దాడి చేశారు. ఓ భూవివాద విషయమై కార్పొరేటర్ సిద్ధం రాజుకు, లాయర్ శంకరాచారి నోటీసులు పంపించారు. దీంతో కార్పొరేటర్ లాయర్ పై ఆగ్రహం చెందారు. కార్పొరేటర్ అయిన నాకే నోటీసులు పంపుతావా అంటూ న్యాయవాదిపై సిద్ధం రాజు దాడి చేయించారు. న్యాయవాది శంకరాచారికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement