Sunday, May 5, 2024

అనూషకు మేయర్ గుండు సుధారాణి పరామర్శ

విద్యార్థిని అనూషపై దాడి హేయమైన చర్య అని వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. శుక్రవారం ఉన్మాది అజాహర్ చేతిలో దాడికి గురై MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని అనూషను మేయర్ గుండు సుధారాణి పరామర్శించినారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని అన్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి అండగా ఉంటామని తెలిపారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న అనూషకు మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ను ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement