Wednesday, May 1, 2024

MBNR: వోల్వో బస్సు బోల్తా.. ఒకరు మృతి

జోగులాంబ గద్వాల (ప్రతినిధి),జనవరి 13 (ప్రభ న్యూస్): జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదు నుంచి చిత్తూరు వెళుతున్న అమెజాన్ జగన్ వోల్వో బస్సు బీచుపల్లి కృష్ణ నది దాటిన తర్వాత అల్లంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం పదవ బెటాలియన్ సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మిగతా 30 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు.

ఎన్ హెచ్ ఎ ఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది, పోలీస్ సిబ్బంది బస్సు ప్రమాద సంఘటన దగ్గర ఉన్న వాళ్లు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బస్సు బోల్తా పడి మంటలు చెలరేగిన సందర్భంలో ప్రయాణికులను కాపాడారు. 30 మంది ప్రయాణికులు సేఫ్గా బయట పడ్డారు. కానీ ఒక మహిళను కాపాడే ప్రయత్నంలో బస్సులో ఉండి బయటికి రాలేని స్థితిలో చెయ్యి విరుక్కపోవడంతో ఒక మహిళ బస్సులోనే మృతి చెందడం జరిగిందని ఎన్ హెచ్ ఎ ఐ పెట్రోలింగ్ వారు తెలిపారు.

అమెజాన్ జగన్ వోల్వో బస్సులో ఇద్దరు డ్రైవర్లు శంషుద్దీన్, ఏసెప్ ఉన్నట్లు ఏసేపు అనే డ్రైవర్ హైదరాబాదు నుంచి 12 నుంచి 1:00 మధ్య బయలుదేరి జడ్చర్ల దగ్గరికి వచ్చిన తర్వాత రెండో డ్రైవర్ శంషుద్దీన్ కి ఇవ్వడం జరిగిందని యేసేపు రెస్టు తీసుకున్నట్లు అయితే శంషుద్దీన్ డ్రైవర్ బీచుపల్లి దాటిన తర్వాత పదవ బెటాలియన్ సమీపంలో బస్సు అదుపుతప్పి కింద పడిందని నిద్రమత్తులో లేసి చూసేసరికి ప్రమాదం జరిగిందని బస్సులో 30 పైగా ప్రయాణికులు ఉన్నట్లు అందరిని సేవ్ చేయగా ఒక మహిళ చనిపోయినట్లు డ్రైవర్ ఎసెప్ తెలిపారు. బస్సు ప్రమాదం నుంచి బయట పడిన ప్రయాణికులలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు ఇందులో ఇద్దరుకి మేజర్ గా గాయాలైనట్లు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు మిగతా వారందరికీ సేఫ్ గా ఉన్నట్లు ఎన్ హెచ్ ఎ ఐ పెట్రోలింగ్ వరకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement