Sunday, May 19, 2024

అదుపుత‌ప్పిన బోట్.. సుర‌క్షితంగా 30మంది ప్ర‌యాణికులు

హుస్సేన్ సాగ‌ర్ లో పెను ప్ర‌మాదం త‌ప్పింది. మంగళవారం నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలులకు హుస్సేన్ సాగర్ లో ఒక బోటు అదుపుతప్పింది. వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ బోట్ క్లబ్ సిబ్బంది.. స్పీడ్ బోట్ల సాయంతో పర్యాటకుల బోటును తీరానికి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా హుస్సేన్ సాగర్ లో భాగమతి బోటు అదుపు తప్పింది. గాలి వేగానికి దూరంగా వెళ్లిపోయింది. ఆ సమయంలో బోటులో సుమారు 30 మంది పర్యాటకులు ఉన్నారు. బోటు అదుపు తప్పడంతో వారంతా భయాందోళనలకు గురయ్యారు. భాగమతి బోటు దూరంగా వెళ్లడం గమనించిన పర్యాటక సిబ్బంది ప్రమాదాన్ని క‌నిపెట్టి స్పీడ్ బోట్లతో రంగంలోకి దిగారు. పర్యాటకులతో సహా బోటును తాళ్ల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాక పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement