Saturday, May 4, 2024

దళిత ద్రోహి కేసీఆర్.. దళిత ద్వేషి హరీష్: రాములమ్మ

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితులకు మంత్రి హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి డిమాండ్ చేశారు. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని విమర్శించారు. అందుకు మొదట హరీష్ రావు ముక్కు నేలకు రాసి దళితులకు క్షమాపణ చెప్పి ఉండాలన్నారు. ఇంతవరకూ చెయ్యలేదని మండిపడ్డారు. హరీష్ రావు దళిత బంధు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని విమర్శించారు.

దళితద్రోహి కేసీఆర్ కి, దళితద్వేషి హరీష్ రావుకు హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టవలసిన సందర్భం ఇది అని విజయశాంతి వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఎన్ని కథలు పడ్డా కూడా కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేసి, ఈయనను పార్టీ నుండి కేసీఆర్ గారు బయటకు వెళ్లగొట్టేది భవిష్యత్తులో తప్పని పరిణామం అని విజయశాంతి జోస్యం చెప్పారు.

ఇది కూడా చదవండి: ఎగిరే బైక్ ని చూశారా?.. ధర ఎంతంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement