Friday, May 10, 2024

కోలుకుంటోన్న సాయి ధ‌ర‌మ్ తేజ్.. రెస్ట్ అవ‌స‌రం..

స్పోర్ట్స్‌ బైక్‌ నడుపుతూ ఒక్కసారిగా బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయిన హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కి .. ఈ ప్రమాదంలో ఆయన కుడి కంటిపై భాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు అప్ప‌ట్లో వెల్లడించారు. ఏకంగా 36 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈ బైక్‌కు యాక్సిడెంట్ జ‌రిగింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో సాయి ధరమ్ తేజ్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యాడు.

కాగా సాయిధ‌ర‌మ్ తేజ్ హెల్త్ పై ప‌లు అనుమానాలు ఉన్నాయి. హస్ప‌ట‌ల్ నుండి డిశ్చార్జ్ అయిన ఆయ‌న‌..ఆ త‌ర్వాత నుంచి అప్ డేట్ లేక‌పోవ‌డంతో ఇంకా ఎంతకాలం రెస్ట్ తీసుకోవాలి…పూర్తిగా కోలుకున్నట్లేనా..సాయి ధరమ్ ఫోటొలు ఎందుకు బయటికి రావ‌ట్లేద‌నే ప‌లు అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఈ మేర‌కు సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి తాజాగా స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది.

సాయిధ‌రమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఎవరినీ కలవకుండా రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే ఈ మెడిసన్స్, యాక్సిడెంట్ ట్రీట్మెంట్ క్రమంలో బరువు తగ్గారు. ఆయ‌న మొహం మీద ఏ గాయాలు లేవు. కాకపోతే ఇంకా కొద్దిగా షాక్ ఉండటంతో మాట తడబడుతోంది. అదీ నాలుగైదు రోజుల్లో పూర్తిగా సెట్ అయ్యిపోతుంది. త్వరలోనే అఫీషియల్ గా జనాలకు కనపడనున్నారనేది మీడియా అందిస్తోన్న స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement