Sunday, April 28, 2024

క‌రోనా ఎంత ప్రమాదకరమో పాలకులకు తెలియదా?: విజ‌య‌శాంతి

క‌రోనా వైరస్ విజృంభ‌ణన పై విజయశాంతి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కొవిడ్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సగం కారణమని స్పష్టమవుతోందని చెప్పారు. గత మూడు, నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వెల్లడైన పరిశోధనాత్మక నివేదికల్ని పరిశీలిస్తే కరోనా కేసుల విషయంలో సర్కారు ఎంత గుట్టుగా వ్యవహరిస్తోందో తెలుస్తుందని అన్నారు.

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రయివేటు ల్యాబ్స్‌లో చేస్తున్న పరీక్షలు… బులిటెన్ ద్వారా ప్రకటిస్తున్న ఫలితాలు… వాస్తవ గణాంకాలకు ఏ మాత్రం పొంతన లేదని విజయశాంతి విమర్శించారు. వ్యవహారం ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్టు అప్పట్లో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదంతా ఒక కోణమైతే… పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులు నరకానికి నకళ్లుగా ఉన్నాయి’ అని విజ‌య‌శాంతి చెప్పారు. ప్రజారోగ్యాన్ని పక్కనపడేసి, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ఈ పాలకుల పట్టింపులేనితనమే వారి పతనానికి నాంది’ అని విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement