Thursday, May 2, 2024

NZB: అయోధ్య శ్రీ రామ తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలంగాణ కో కన్వీనర్ గా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, జనవరి 4 (ప్రభ న్యూస్) : అయోధ్య శ్రీ రామ తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలంగాణ కో కన్వీనర్ గా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ నియామకమయ్యారు. ఇటీవల జరిగిన అయోధ్య పునర్ నిర్మాణ సమావేశంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కమిటీ తెలంగాణ కో కన్వీనర్ గా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణని నియమించారు.

ఈ మేరకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ కు అయోధ్య పునర్ నిర్మాణ కమిటీ వారు తెలిపారు. తెలంగాణ కో కన్వీనర్ గా నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున అయోధ్యకు తరలించేందుకు ఆయన తగు చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement