Friday, April 26, 2024

రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి- బెల్లంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుని వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒంటిపై నలుపు రంగు డబ్బాల షర్ట్, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement