Thursday, April 25, 2024

క‌రోనా బారిన ప‌డ్డా – ట్వీట్ చేసిన ఉపాస‌న‌

గత వారం తాను కరోనా బారిన పడ్డానని తెలిపింది మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌. వైద్యుల సూచనతో వారం రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నానని చెప్పింది. ప్రస్తుతం కోలుకున్నానని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు. చెన్నైలో ఉన్న తాతయ్య, అమ్మమ్మల వద్దకు వెళ్లేందుకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… ఈ పరీక్షలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందట‌. అయితే ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు కనిపించాయని అన్నారు. కేవలం పారాసెటమాల్, విటమిన్ ట్యాబ్లెట్లను మాత్రం వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారని చెప్పారు. తనకు కరోనా సోకడంతో బాడీ పెయిన్స్, జుట్టు ఊడిపోవడం, నీరసం వంటి సమస్యలు రావచ్చని కొందరు చెప్పారని… అయితే తనకు అలాంటి సమస్యలు ఎదురు కాలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement