Friday, March 29, 2024

Kurnool: పాఠశాలలో దొంగలు.. ఏం ఎత్తుకెళ్లారంటే..

కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్ర గూడూరు గ్రామంలోని ఎంపియుపి స్కూల్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మంగళవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్కూలు లోనికి చొరబడి లైబ్రరీ పుస్తకాలు ఎత్తుకెళ్లారు. పాఠశాలలోని హెచ్ఎం రూములో వెనుక భాగంలో ఉన్న కిటికీ కడ్డీలను తొలగించి లోపలికి చొరబడ్డారు. కోడి గుడ్లను పగలగొట్టి బీరువాలు పగలగొట్టి రూంలో ఉన్న టివిని ఎత్తుకెళ్లి ఎందుకు యత్నించారు. అయితే, టీవీ రాకపోవడంతో లైబ్రరీ పుస్తకాలను కొన్నిటిని తీసుకెళ్లారు. ఈ ఘటనపై పాములపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిర రాణి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement