Monday, April 29, 2024

Yadagirigutta : ల‌క్ష్మీనృసింహుని సేవ‌లో కేంద్ర‌మంత్రి ఆర్కే

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని కేంద్ర‌మంత్రి ఆర్కేసింగ్ ద‌ర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణాలను పరిశీలించారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహా అద్భుతంగా పునర్నిర్మించారని కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ కితాబిచ్చారు. ఆలయ నిర్మాణ రీతులపై ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దారన్నారు. అంతకుముందు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement