Tuesday, May 7, 2024

Breaking: బైకును ఢీకొట్టిన గుర్తు తెలియ‌ని వాహనం.. న‌లుగురికి తీవ్ర‌ గాయాలు

భూపాలపల్లి , (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా బొగ్గులవాగు సమీపంలో యాక్సిడెంట్ జ‌రిగింది. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జ‌రిగింది.

భూపాలపల్లి మండలం పెద్దపూర్ శివారు వెంకటేశ్వర్ల పల్లికి చెందిన ఆకునూరి రవీందర్ 34, రమేష్ 35, రాధిక 28, ఓ చిన్నారి 10 మల్హర్ మండలం రుద్రారానికి వెళ్లి తిరిగి వ‌స్తున్నారు. ఈ క్రమంలో బొగ్గులవాగు వద్ద గుర్తు తెలియని వాహనం వీరి బైకును ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆ రూట్‌లో వెళ్తున్న వాహనదారులు గమనించి 108 కి సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు భూపాలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement