Sunday, April 28, 2024

KNR: ప్రజలను మోసం చేసిన ఉజ్వల చైర్మన్ శ్రీధర్ అరెస్టు

అమాయక ప్రజల అవసరాలను బలహీనంగా భావించి కోట్లాది రూపాయలు దండుకున్న మోసకారిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వేములవాడ పట్టణం మల్లారం రోడ్ లో ఉజ్వల త్రిప్ట్ క్రెడిట్ కోపరేటివ్ పేరుతో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల మొదలగు జిల్లాలలో అమాయక ప్రజలను మోసం చేశాడు. దాదాపు 1600 మంది పైగా అమాయక ప్రజలను ఆసరా చేసుకొని వారి వద్ద నుండి సుమారు మూడు కోట్ల రూపాయలు మోసం చేసిన ఫైనాన్స్ చైర్మన్ ను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్ కు తరలించారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ… ప్రజలు మోసపూరిత సంస్థలను నమ్మవద్దని సూచించారు. అనుమానిక సంస్థలు వ్యక్తులు తారస పడినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement