Thursday, May 2, 2024

TS : ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి సేవ‌లో ప్ర‌ధాని…

ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌లో రెండోరోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఉద‌యం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన రాజ్‌భవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆల‌యంలో అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. పట్టుచీరె, ఇతర కానుకలను అమ్మవారికి సమర్పించారు. అనంత‌రం ఆల‌య పూజ‌లు ప్ర‌ధానిని స‌న్మానించి వేద ఆశీర్వ‌చ‌న‌లు అంద‌జేశారు. అమ్మ‌వారి తీర్థ‌ప్ర‌సాదాల‌తో పాటు జ్ఞాపిక‌ను అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement