Monday, April 29, 2024

TS : ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు…

 రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ మార్పులు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీజీపీ ఆఫీసు ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలు సహా మాజీ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎస్ఐబీ సహా ఇతర కీలక విభాగాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుపై అంతర్గత విచారణ జరిపింది. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్​కు సంబంధించి రూల్స్ అతిక్రమించినట్లు తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement