Thursday, April 25, 2024

దుప్పట్లో భార్య మృతదేహం.. చంపాడా? చనిపోయిందా?

రంగారెడ్డి జిల్లా హయత్​ నగర్​లో దారుణం చోటుచేసుకంది. గుట్టు చప్పుడు కాకుండా భార్య మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు యత్నించాడు ఓ భర్త. వివరాల్లోకి వెళ్లితే.. ఇద్దరు యువకులు కలిసి గురువారం రాత్రి యువతి మృతదేహాన్ని దప్పట్లో చుట్టి గుట్టుగా తరలిస్తున్నారు. బాతుల చెరువు సమీపంలో వారిని స్థానికులు అడ్డుకున్నారు. అనుమానం వచ్చి ఇద్దరినీ నిలదీశారు. అయితే, వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు సమచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..  ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల విచారణలో.. ఆ యువతి తన భార్య అని, తమది ప్రేమ వివాహమని వినోద్ అనే యువకుడు చెప్పాడు. అయితే, ఆమె ఎలా చనిపోయిందని అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పోలీసులు వారిని విచారిస్తున్నారు. మహిళ ఒంటిపై ఎలాంటి బట్టలు లేకపోవడంతో హత్య చేశారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: భారత్ రావాలంటూ కమలా హారిస్‌ కు మోదీ ఆహ్వానం

Advertisement

తాజా వార్తలు

Advertisement