Friday, April 26, 2024

TS : ఇద్దరు ఎంపీ అభ్యర్థుల ప్రకటన గొప్ప నిర్ణయం…కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌…

మాజీ సీఎం కేసీఆర్ మ‌రో ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డికి గులాబీ బాస్ ఈ సారి చాన్స్ ఇచ్చారు. ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

- Advertisement -

‘ఇద్దరు ఆల్ ఇండియా మాజీ ఆఫీసర్లు బీఆర్ఎస్ టికెట్‌పై లోక్ సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈ గొప్ప నిర్ణయానికి కేసీఆర్ గారికి అభినందనలు.. నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు, మెదక్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిలకు బెస్ట్ విషెస్. ఈ ఇద్దరిని ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపుతారని నమ్మకం ఉంది.. ‘ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement