Thursday, April 25, 2024

AP : క‌డ‌ప జిల్లాలో విషాధం…ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

క‌డ‌ప జిల్లాలో విషాధం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కుమార్తె సహా దంపతులు పద్మావతి, సుబ్బారావు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన‌వారు.

స్థానిక తహశీల్దార్, రెవెన్యూ అధికారులే తమ సూసైడ్‌కు కారణమని లెటర్ రాసి మరీ దారుణానానికి పాల్పడ్డారు. వీరికి మూడెకరాల పొలం ఉంది.ఆ పొలాన్ని అమ్ముదామనుకుంటే రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసినట్లు దంపతులు ఆరోపించారు. తీవ్ర మనస్థాపానికి గురైన పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఉరేసుకున్నారు. భర్త సుబ్బారావు రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement