Monday, May 6, 2024

ఆస్తి కోసం ఇరు కుటుంబాల ఘర్షణ.. కర్రలు, రాళ్లతో దాడి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో ఆస్తి కోసం ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగాయి. గ్రామానికి చెందిన కరోళ్ల చిన్న మల్లయ్యకు భూమయ్య కుటుంబలా మధ్య ఆస్తి తగాదా వుంది. ఇరు కుటుంబాల సభ్యులు ఒరరిపై మరొకరు కర్రలతో రాళ్లతో దాడి చేసుకున్నారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో  కరోళ్ల చిన్న మల్లయ్య, కొడుకు రవి, భార్య భూమవ్వ కుమార్తె రేణుకలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ప్రస్తుతం బాధితులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement