Tuesday, May 21, 2024

Hyderabad: ఆరో అంతస్తు పైనుంచి పడి ఇద్దరి మృతి..

హైదరాబాద్‌ : ఆరో అంతస్తు పైనుంచి పడి ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ అడ్డగుట్ట కాలనీలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. వివరాలు.. అడ్డగుట్టలో మెయిన్ రోడ్డు పక్కనే భవన నిర్మాణం జరుగుతుంది. ఇవాళ ఉదయం కార్మికులు పనులు చేస్తున్న సమయంలో సెంట్రింగ్ కర్రలు విరిగిపడ్డాయి.

 దీంతో నిర్మాణ పనుల్లో ఉన్న కూలీలు ఆరో అంతస్తు నుంచి కిందపడ్డారు. అంతేకాకుండా గోడ కూలి ఇటుకలు చెల్లాచెదురుగా రోడ్డు మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ఘటన స్థలంలోనే మృతిచెందారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు కూలీల పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇక, ఈ ఘటనలో మృతిచెందిన కూలీలు బీహార్‌కు చెందినవారిగా తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement