Tuesday, April 30, 2024

పునః ప్రారంభమైన రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్ధుల దేహదారుఢ్య పరీక్షలు.. .

క‌ర్నూలు – రెండు రోజుల వర్షం కారణంగా నిలిచిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలు గురువారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి.
పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ లో దేహదారుడ్య పరీక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి కే 600 మంది అభ్యర్దులు హాజరయ్యారు. ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ జిల్లా ఎస్పీ జి . కృష్ణ కాంత్ , సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్లు. పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement