Thursday, May 2, 2024

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు మృతి

ఆర్మూర్ ప్రభ న్యూస్ సెప్టెంబర్ 7 – కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు కలిశాయి. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భవన నిర్మాణానికి తీసిన గుంతలు ఇద్దరూ పసిపిల్లల ప్రాణాంతకంగా మారాయి. మరిన్ని వివరాలలోకి వెళ్తే….నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్ పేట్ గ్రామంలో ప్రమాదవశాత్తు గుంతలో పడి చరణ్ (5) నాసిక్ (7) అనే ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు పోయాయి.

ఇత్వార్ పేట్ లో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ భవన నిర్మాణం కోసం ఇటీవల పనులు ప్రారంభించారు. పనుల నిర్మాణంలో కొనసాగిన కాంట్రాక్టర్ కారణంగా తవ్విన గుంతలను కాంట్రాక్టర్ పూడ్చివేయక నిర్లక్ష్యంగా వ్యవహరించాలని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆడుకుంటూ ఈ గుంతలో పడి ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ ఎస్సై గోపి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement