Monday, April 29, 2024

Breaking | ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైకులు.. ములుగు జిల్లాలో ఘ‌ట‌న‌

ములుగు (ప్రభ న్యూస్): ములుగు జిల్లా మల్లంపల్లి స‌మీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. మంగళవారం సాయంత్రం ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. ములుగు మండలంలోని మహ్మద్ గౌస్ పల్లి వ‌ద్ద‌ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వ‌చ్చిన‌ రెండు ద్విచక్ర వాహనాలు బ‌లంగా ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అత‌ని పరిస్థితి విషమంగా ఉంది. మ‌రికొంద‌రికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement