Tuesday, April 30, 2024

PM MODI :ఇవాళ తుఫ్రాన్‌, నిర్మల్ ప్ర‌ధానిమోడీ ఎన్నిక‌ల ప్ర‌చారం

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రెండు చోట్ల ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించనున్నారు. తుఫ్రాన్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలకు మోదీ హాజరుకానున్నారు.

ఉదయం గచ్చిబౌలిలోని కన్హా శాంతి వనాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. మధ్యాహ్నం తుఫ్రాన్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అనంత‌రం నిర్మల్‌ సభకు వెళ్తారు. సాయంత్రం బయలుదేరి హాకింపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. హాకింపేట విమానాశ్రయం నుండి బయలుదేరి తిరుపతి వెళ్లనున్నారు. రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలోనే బస చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement