Sunday, April 28, 2024

CM KCR : ఇవాళ నాలుగు నియోజ‌క‌వర్గాల్లో సీఎం కేసీఆర్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు

సీఎం కేసీఆర్ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇవాళ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొనున్నారు. ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరుకానున్నారు.

ఇవాళ మధ్యాహ్నం ఖానాపూర్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. అక్కడి నుంచి జగిత్యాల సభకు చేరుకుంటారు. సాయంత్రం వేములవాడలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అక్క‌డు నుంచి దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement