Sunday, April 28, 2024

తెలంగాణ ప‌బ్లిక్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా జ‌నార్ధ‌న‌రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ చైర్మన్‌తోపాటు ఏడుగురు సభ్యులను సీఎం కేసీఆర్‌ నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ వెంటనే ఆమోదించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బి. జనార్దన్‌ రెడ్డి (ఐఏఎస్‌) నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన పని చేస్తున్నారు.
సభ్యులు వీరే..
రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ).,
ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ .,ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి).,
కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ బీఈడీ., ఎమ్మె ఎల్ ఎల్ బీ., స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ )
సుమిత్రా ఆనంద్ తనోబా (ఎమ్మే తెలుగు., తెలుగు పండిట్ ).,
కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి)
ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి ఎ ఎమ్ ఎస్(ఉస్మానియా)., ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్)
ఆర్. సత్యనారాయణ (బిఎ., జర్నలిస్ట్)…లను సిఎం కెసిఆర్ నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement