Monday, April 29, 2024

TSPSC – గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే కు హైకోర్టు నో…

హైద‌రాబాద్ : గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ‌ హైకోర్టు నిరాక‌రించింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) జూన్‌ 11న నిర్వహించ తలపెట్టిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో దాఖ‌లైన‌ రిట్‌ పిటిషన్‌పై ఇవాళ విచార‌ణ జ‌రిగింది. కాగా, అయితే గురువారం ఉద‌య‌మే ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది. తన కుమార్తె కూడా గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాసినందున తాను విచారించ‌లేన‌ని జ‌స్టిస్ కే ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. పిటిష‌న్‌ను మ‌ధ్యాహ్నం మ‌రో బెంచ్‌కు పంపిస్తాన‌ని ల‌క్ష్మ‌ణ్ వివ‌రించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టి.. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది.
వివిధ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు సంబంధిత పరీక్షల మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను అమలు చేయకుండా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయడం చట్టవిరుద్ధమని 36 మంది అభ్యర్థులు ఆ పిటిషన్‌లో పేరొన్నారు. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్, కార్య‌ద‌ర్శి, హోం శాఖ కార్య‌ద‌ర్శి, సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది కోర్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement