Wednesday, April 17, 2024

ప్ర‌పంచం మొత్తం భార‌త్ వైపు చూస్తోంది.. ప్ర‌ధాని మోడీ

ప్ర‌పంచ ప‌ర్యాట‌కులు భార‌త్ ని సంద‌ర్శించి ఆ దేశాన్ని చూసి అర్థం చేసుకోవాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు ప్ర‌ధాని మోడీ. ఢిల్లీ..డెహ్రాడూన్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ రైలుని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా భారత్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన తీరును ప్రపంచం ప్రశంసిస్తోందని మోడీ అన్నారు. కాగా ఉత్తరాఖండ్ కు ఇదొక గొప్ప అవకాశం అని ప్రధాని పేర్కొన్నారు. ముక్కోణపు పర్యటన ముగించుకుని తాను ఇప్పుడే తిరిగి వచ్చానని, ప్రపంచం మొత్తం భారత్ వైపు ఎంతో ఆశతో చూస్తోందని చెప్పగలనన్నారు.

కాగా ఉత్తరాఖండ్ లో ప్రారంభించిన వందే భారత్ రైలు గురించి మాట్లాడుతూ, ఇది దేశ రాజధానిని వేగంగా కలుపుతుందని, ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య నడిచే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు దేశ రాజధానిని వేగంగా కలుపుతుంది. ఈ రైలుతో ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. రైలులోని సౌకర్యాలు ఈ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయ‌ని అన్నారు. కాగా, వాణిజ్య సేవలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు డెహ్రాడూన్ నుంచి ప్రారంభ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరుతుంది. ఢిల్లీ, డెహ్రాడూన్ లను కలిపే వందే భారత్ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి కేవలం 4 గంటల 45 నిమిషాలు పడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మార్గంలో ఈ నెల 29 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement