Sunday, April 28, 2024

TS – విభ‌జ‌న హామీలేమ‌య్యాయి? – బండిపై మంత్రి పొన్నం ఫైర్‌

తెలంగాణకు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదని, విభజన హామీలు ఎందుకు అమలు చెయ్యలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ఆదివారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క వైద్య కాలేజీ కూడా ఇవ్వడానికి మనసు రాలేదా? ఐదేళ్లు ఎంపీగా ఉండి ఏం చేశావ్ సంజయ్ అంటూ ప్రశ్నించారు.

అవినీతితోనే ప‌ద‌వి దొబ్బింది


కరీంనగర్ ఎంపీ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేదని.. బండి సంజయ్ వల్ల కరీంనగర్ పరువు పోయిందని మంత్రి పొన్నం అన్నారు. సంజయ్ అవినీతి చేయడం వల్లే.. అధ్యక్ష పదవి పోయిందన్నారు. బండి సంజయ్.. ప్రధాని మోదీ పేరుతో ఓట్లు అడగాలని.. రాముని పేరుతో కాదని అన్నారు. అభివృద్ధి చేయండి అంటే.. ఇంటింటికీ రాముని ఫోటోలు, అక్షింతలు పంపిస్తారా? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబేద్కర్ కు నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత,ఆర్థిక వేత్త, న్యాయకోవిదులు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులు, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు పొన్నం ప్రభాకర్ , మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుదు డా.కవ్వంపల్లి సత్యనారాయణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement