Friday, April 26, 2024

TS: ఫ్రాన్స్ లో కొనసాగుతున్న కేటీఆర్ పర్యటన

టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న ఫ్రాన్స్ లో కొన‌సాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా కేటీఆర్ తన బృందంతో ఫ్రాన్స్ వెళ్లారు. ఈ క్రమంలో ఎంబీడీఏ మిస్సైల్ సిస్టమ్స్ సంస్థ డైరెక్టర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు.

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. రాష్ట్రంలో ఉత్పాదక రంగానికి ఉన్న అనుకూలతలను వారికి స‌వివ‌రంగా తెలియ‌జేశారు. అనంతరం ఫ్రాన్స్ లోని అతిపెద్ద కాస్మొటిక్ క్లస్టర్ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బెచెర్యూతో చర్చలు జరిపారు.

భారత్ లో కాస్మొటిక్స్ కున్న డిమాండ్ ను, తెలంగాణలో కాస్మొటిక్స్ పరిశ్రమల స్థాపనపై తమ ఆలోచనలు పంచుకున్నారు. ఇక ఫ్రాన్స్ లో భారత్ రాయబారి జావేద్ అష్రఫ్ ను కూడా ఈ పర్యటనలో కేటీఆర్ కలిశారు. పెట్టుబడుల కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను ఆయనకు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement